రేవంత్ రెడ్డి. సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం

Date: 2024-07-19
news-banner

అందరి టీవీ డిజిటల్ / ములుగు జిల్లా ప్రతినిధి 
ఏటూరు నాగారం మండల కేంద్రంలోని బస్టాండు ఆవరణలో బుధవారం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారు. గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క గార్ల చిత్రపటాలకు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు.   
ములుగు జిల్లా ఏటూరు నాగారం అభివృద్ధి ప్రదాత మంత్రి సీతక్క , నాలుగు వందల కోట్లతో ములుగు జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ అంతర్గత రోడ్లు, ములుగు జిల్లా కేంద్రంలో మోడల్ బస్టాండ్ నిర్మించుటకు,  ప్రతి మండలంలో సంక్షేమ భవనాలు నిర్మించుటకు నిధులు తెచ్చిన సీతక్క గారికి, నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.



ఈ సందర్భముగా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న. మైనార్టీ అధ్యక్షులు అయుబ్ గారు. మండల అధ్యక్షుడు చిటమట రఘు. గారు జెడ్పీటీసీ నామ కరం చoదు గారులు.జిల్లా కార్యదర్శి గుడ్లు దేవేందర్ గారూ మాట్లాడుతూ ములుగు జిల్లా కేంద్రంలో మోడల్ బస్టాండ్ నిర్మాణానికి మరియు6 ములుగు నియోజకవర్గంలోని అంతర్గత పి.ఆర్. మరియు ఆర్&బి రోడ్లు మంజూరు కోసం, అలాగే ప్రతి మండలం నందు సంక్షేమ భవనాల కోసం నాలుగు వందల కోట్ల కోసం శ్రమించి తెచ్చిన సీతక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే రాష్ట్రంలోని రైతుల శ్రేయస్సుకై ముఖ్యంగా సుమారు 30 వేల కోట్లతో ప్రతి రైతుకు 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేయడానికి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో  తదితర నాయకులు పాల్గొన్నారు





image

Leave Your Comments