ములుగు జిల్లా మల్లంపల్లి కెనాల్ వద్ద ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జి కాసేపటి క్రితం కుంగిపోయింది . దీంతో ములుగు నుంచి వరంగల్, హనుమకొండ, హైదరాబాద్కు వెళ్లాల్సిన వాహనాలు, ఆర్టీసీ బస్సుల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అటువైపు వాహనాలు వెళ్లకుండా పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.
ములుగు వైపు నుంచి వెళ్లే వాహనాలను రేగొండ- పరకాల మీదుగా పోలీసులు దారి మళ్లించారు.