అందరి టీవీ డిజిటల్ / వరంగల్ జిల్లా ప్రతినిధి
వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రైల్వే స్టేషన్ ఎదురుగా అనదికారికంగా హాస్పిటల్ వలె బెడ్స్ ఏర్పాటు చేసి ఎటువంటి అర్హత లు లేకుండా ఆదర్శ వైద్యులు అని పేర్కొంటూ, ప్రజలను మోసం చేసి రిజిస్టర్డ్ వైద్యుల వలె
అల్లోపతి వైద్యం నిర్వహిస్తున్న ముగ్గురు నకిలీ వైద్యులను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ అధికారులు గత నెల జరిగిన తనిఖీ లలో గుర్తించారు.
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రార్ డా డి. లాలయ్య కుమార్, చైర్మన్ డా కె. మహేష్ కుమార్ ల ఫిర్యాదు మేరకు ఎన్ ఎం సి చట్టం 34,54, టి ఎస్ ఎం పి ఆర్ చట్టం 22, బి ఎన్ ఎస్ 318,319 ప్రకారం కేసు FIR (214/2025 -02/08/2025 తేదీన) నెక్కొండ పోలీస్ స్టేషన్ లో నమోదు చేశారు.
కేసు నమోదు చేయబడిన నకిలీ వైద్యుల వివరాలు :
1. లావణ్య ఫస్ట్ ఎయిడ్ సెంటర్ - ఎం. రమేష్
2. రుద్ర ఫస్ట్ ఎయిడ్ సెంటర్ -బి.రవి
3. అమ్మ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ - డి.అశోక్
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ లేని వ్యక్తులు ఎవరు కూడా అల్లోపతి /మోడర్న్ మెడిసిన్ వైద్య సేవలు అ0ధించరాదని ప్రథమ చికిత్స కేంద్రం ముసుగులో ఆశాస్త్రియ పద్ధతులలో ఇష్టంవచ్చిన ఆంటీబయోటిక్, స్టేరాయిడ్,నొప్పి ఇంజెక్షన్స్ వేయడం, ల్యాబ్ టెస్ట్ లు నిర్వహించడం, సెలైన్లు పెట్టడం, హాస్పిటల్ వలె బెడ్స్ ఏర్పాటు చేసి ప్రజలను మోసం చేసి, ప్రజారోగ్యం దెబ్బతీసే వారిపై చట్ట పరమైన చర్యలు తీస్కుంటామని వీరికి ఒక సంవత్సరం జైలు శిక్ష, 5 లక్షల వరకు జరిమానా విధిస్తారని, రెండవ సారి కేసు నమోదు అయితే 3 సంవత్సరాలు జైలు శిక్ష మరియు 10 లక్షలు ఫైన్ వేస్తారని
అలాగే
క్లినికల్ ఎస్టాబ్లిష్ మెంట్ చట్ట ప్రకారం జిల్లా వైద్యాధికారికి సీజ్ చేయవలసినదిగా ఫిర్యాదు చేస్తామని
టీజీఎంసీ పబ్లిక్ రిలేషన్ కమిటీ చైర్మన్ డా వి. నరేష్ కుమార్ తెలియ చేశారు.
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నకిలీ వైద్యుల వద్దకు వెళ్లి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని, నకిలీ వైద్యుల పైన సమాచారం
91543 82727 నెంబర్ కి వాట్సాప్ ద్వారా ఇవ్వాలని తెలియ చేశా