తెలంగాణాలో మరో మారు భూకంపం ; పరుగులు తీసిన జనం

Date: 2024-12-07
news-banner
అందరి టీవీ డిజిటల్ / మహబూబ్ నగర్ జిల్లా 
తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. 
ఇటీవల తెలంగాణలోని ములుగుతో పాటుహైదరాబాద్‌, తదితర జిల్లాల్లోని భూకంపం సంభవించింది..
తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈనెల 4వ తేదీన తెలంగాణలోని ములుగుతో పాటుహైదరాబాద్‌, తదితర జిల్లాల్లోని భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.3గా నమోదైందని గుర్తించారు అధికారులు. ఇదిలా ఉంటే తాజాగా శనివారం తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 3.0గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
image

Leave Your Comments