సీపీఐ (మావోయిస్ట్) ఏరియా కమిటీ సభ్యురాలు (ACM) ఎటురునాగారం ASP ముందు లొంగిపోయారు

Date: 2024-09-12
news-banner
   అందరి టీవీ డిజిటల్ / డెస్క్ ప్రత్యేకం 
పోడియం సోమిడి @ రోని D/o కోస, ఏరియా కమిటీ సభ్యురాలు (ACM) హోదా, 2వ సెంట్రల్ రీజినల్ కంపెనీ , CPI (మావోయిస్ట్) N/o పూజారి కా0కేర్  ఈరోజు  ఎటురునాగారం ASP ముందు లొంగిపోయింది.
కుర్సం సమ్మయ్య @ సమ్మన్న N/o పెద్ద ఉట్లపల్లి, పూజారి కా0కేర్  RPC కమాండర్  ప్రోద్బలంతో, అతని మాటలకు ఆకర్షితురాలు  అయి, మావోయిస్ట్ పార్టీ భావజాలనికి లొను అయ్యి 2019    సంవత్సరంలో మిలీషియా లో  చేరింది. పూజారి కా0కేర్  RPC లో కుర్సం సమ్మయ్య @ సమ్మన్న దగ్గర ఆరు నెలలు పని చేసింది . ఈ కాలంలో ఆమె  12 బోర్ వేపన్  కలిగి ఉన్నది.  అదే  సంవత్సరంలో దొడ్డి పోజ్జ @ ప్రకాష్ 2వ సెంట్రల్ రీజినల్ కంపెనీ  కమాండర్ ఆమెకు  పార్టీ సభ్యురాలుగా  పదోన్నతి కల్పించినాడు  మరియు 2వ సెంట్రల్ రీజినల్ కంపెనీకి బదిలీ చేయబడ్డది, ఇక్కడ సాగర్ కి గార్డు గా ఒక  సంవత్సరం పని చేసింది. తరువాత 2వ సెంట్రల్ రీజినల్ కంపెనీ, 1 వ ప్లాటూన్, B-సెక్షన్ లో సభ్యురాలిగా చేరింది. 2023, జూన్ నెలలో ఏరియా కమిటీ సభ్యురాలు (ACM) హోదా పొందినది. ఈ సమయంలో ఆమె INSAS రైఫిల్‌ని మోయడం జరగింది. ఈమె మీద (4) లక్షల నగదు రివార్డ్ ఉంది .

ఆమె  క్రింది హత్యలు మరియు ఎన్కౌంటర్లలో  పాల్గొన్నది:
1.ఛత్తీస్‌గఢ్‌లోని కర్రెగుట్టలులో బేఛిరాకుమాడుగు ఎదురుకాల్పుల్లో పాల్గొన్నది. ఈ   ఎదురుకాల్పుల్లో ముగ్గురు మగ మావోయిస్టులు  మరణించారు.
2.ఛత్తీస్‌గఢ్‌లోని జగురగొండ, PS పరిది లో కుందేర్ గ్రామం అంబుష్ లో ముగ్గురు  - CRPF కానిస్టేబుల్ లను కాల్చి చంపిన ఘటనలో పాల్గొన్నది.  
3.ఛత్తీస్‌గఢ్‌లోని పెద్ద బట్టుం మరియు కవురగట్ట పోలీసు దాడిలో తప్పించుకున్న ఘటలలో ఉంది.
4.ఛత్తీస్‌గఢ్‌లోని ధర్మారం క్యాంపు దాడిలో పాల్గొన్నది. ఇందులో ముగ్గురు మగ మావోయిస్టులు  మరణించారు.
5.కర్రెగుట్టలు ప్రాంతంలో ఎన్నో బాంబులు అమర్చినది. 

లొంగిపోవడానికి కారణాలు :
1.మావోయిస్టుల భావజాలం పట్ల విరక్తి మరియు ప్రజల నుండి డబ్బులు వసూలు చేసి దోపిడీ సొమ్మును ముఖ్య  నేతలు  పంచుకుంటున్నారు.
2.విపరీతమైన పనిభారం, తిండిలో తక్కువ క్యాడర్‌ల పట్ల వివక్ష చూపడం మరియు వారిని విచక్షణారహితంగా కొట్టడం.
3. ఛత్తీస్‌గఢ్‌లో పోలీసు క్యాంపులు రావడం మరియు ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను తెలుసుకుని సాధారణ జీవితం గడపడానికి మావోయిస్టు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.
మీడియా ద్వారా, ఎటూరునాగారం పోలీసుల విజ్ఞప్తి ఏమనగా ,  మావోయిస్టు పార్టీకి చెందిన  నాయకులకు, మిలీషియా సభ్యులకు మరియు  సందేశాన్ని అందించాలని, అందరూ జన జీవన స్రవంతిలో చేరాలని తద్వారా ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు మరియు కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే ప్రజల జీవితాల మెరుగు కోసం మాతో కలిసి పని చేయండి. లొంగిపోయిన దళం సభ్యులకు అన్ని రాయితీలను సకాలంలో చెల్లించేలా తదుపరి చర్యలు తీసుకోబడతాయి .




https://www.youtube.com/embed/JJMPvUNHPU4?si=xaP5EdHCaPeFV4fq






image

Leave Your Comments