ఆర్ ఎంపీ సెంటర్ ను సీజ్ చేసిన DMHO ,పరేషాన్ లో ఆర్ ఎంపీ లు

Date: 2024-08-06
news-banner

అందరి టీవీ డిజిటల్ / మహబూబాద్ జిల్లా 
మహబూబాబాద్  జిల్లా మరిపెడ లో నకిలీ వైద్యుడు శంకర్ కు చెందిన ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ను 
 జిల్లా వైద్యాధికారి డా కళావతి  మరియు జిల్లా అధికార బృందం తో కలిసి సీజ్ చేశారు 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు ఎవరైనా ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలని నాణ్యమైన చికిత్స క్వాలిఫైడ్ డాక్టర్ లతో మీకు వైద్య సేవలు ఉంటాయని తెలుపుతూ 
ఆర్ ఎంపీ లు డాక్టర్ లు కాదు వాళ్ళ వద్దకు వెళ్లి మీ ప్రాణాలను రిస్క్ లో పెట్టుకోవద్దని అన్నారు 
గతం లో మరిపెడ లో సదరు నకిలీ వైద్యుడు & మిగతా నకిలీ  వైద్యులపై  తెలంగాణ వైద్య మండలి పిర్యాదు చేయడం జరిగింది 
ఆర్ ఎంపీ సెంటర్ లపై నిఘా పెట్టడం వారిపై క్రిమినల్ కేసు లు నమోదు చేయడం జరుగుతుందని వారు తెలిపారు 



image

Leave Your Comments