అందరి టీవీ డిజిటల్ / వరంగల్ జిల్లా ప్రతినిధి
10,000 లంచం తీసుకుంటూ సంగెం మండలం పంచాయతీరాజ్ ఏఈ రమేష్ సోమవారం హనుమకొండలో ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. సంగెం మండలం కుంటపల్లి గ్రామంలో ఓ ఇంటి నిర్మాణం కోసం బాధితుల నుంచి పదివేల రూపాయల డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు, కాగా ఏఈ రమేష్ అక్రమ ఆస్తుల గురించి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు