అందరి టీవీ డిజిటల్ / వరంగల్ తూర్పు ప్రత్యేకం
ఈరోజు వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం వరంగల్ చౌరస్తా లో రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు నిరసనగా రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దహనం చేసిన బీజేపీ నాయకులు. అనంతరం జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మాట్లాడుతూ అమెరికా పర్యటనలో భారతదేశ కీర్తి ప్రతిష్టలను, ప్రజాస్వామ్యం పట్ల, భారతదేశ ప్రజలను అవమానించేలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని, దేశంపై అక్కస్సుతో విషం చిమ్ముతున్నారు. రిజర్వేషన్ల రద్దుకు తెరలేపోతున్నారని, భారత వ్యతిరేక శక్తులు, వ్యక్తులతో రాహుల్ సమావేశం అవడం దుర్మార్గంమని, అప్పుడు నెహ్రూ తర్వాత ఇందిరా ఇప్పుడు రాహుల్ ఎస్సీ ఎస్టీ బీసీల సామాజిక న్యాయానికి తూట్లు పొడిచేందుకు తాను తన పార్టీ సిద్ధమని మరోసారి మైనార్టీ పక్షపాతాన్ని బహిరంగంగా ప్రకటించిన రాహుల్ గాంధీ అని గంట రవికుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విదేశీ పర్యటనలో రాహు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యలు దేశ ప్రతిష్టను గాయపరిచాయని మండిపడ్డారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెప్పడం ద్వారా కాంగ్రెస్ రిజర్వేషన్ వ్యతిరేక వైఖరి బయటపడిందని అన్నారు బిజెపి ఉన్నంతవరకు రిజర్వేషన్లను రద్దు చేయడం గాని దేశభద్రతతో ఎవరైనా చిలగాటమాడటాన్ని అనుమతించదని అన్నారు. రిజర్వేషన్లు కల్పించిన అంబేద్కర్ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ ది అని అన్నారు. ఇలా హక్కుల కోసం రాహుల్ గాంధీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
https://www.youtube.com/embed/DWprv8WXIqE?si=SmyRKcsF4dCmcBbe