ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య బీమా పథకం పేదలకు ఓ వరం

Date: 2024-09-12
news-banner

అందరి టీవీ డిజిటల్ / డెస్క్ ప్రత్యేకం 

దేశంలోని 70 ఏళ్లు పైబడిన వయసు కలిగిన సీనియర్‌ సిటిజన్లందరికీ ఆయుష్మాన్ భారత్‌ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేసేందుకు ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ మీడియాకు వెల్లడించారు. 

70 ఏళ్లు, ఆపై వయస్సు కలిగిన వారికి ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని వర్తింపజేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం గొప్ప మానవతా దృక్పథంతో కూడుకున్నదన్నారు. తాజా నిర్ణయంతో దాదాపు 6 కోట్ల మంది సీనియర్‌ సిటిజన్లకు లబ్ది కలుగుతుందని మంత్రి తెలిపారు. వారి సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందే అవకాశం దక్కుతుందని వెల్లడించారు.
 ఇప్పటికే ఈ పథకం కింద లబ్దిదారులుగా ఉన్న కుటుంబాల్లో ఉన్న సీనియర్‌ సిటిజన్లకు అదనంగా మరో రూ.5లక్షలు బీమా వర్తింపజేస్తున్నట్లు అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఇతర బీమా పథకాల్లో చేరి ఉన్నవారు ఏదైనా (కొనసాగిస్తున్న బీమా లేదా పీఎంజేఏవై) ఎంచుకొనేందుకు వెసులుబాటును సైతంకల్పించారు. 
ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య బీమా పథకాన్ని 2018 సెప్టెంబర్‌లో కేంద్రం లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద దేశంలోని పేద కుటుంబాల్లోని ప్రతి సభ్యునికి ఆయుష్మాన్ కార్డు అందిస్తారు. ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు రూ. 5లక్షల వరకు వైద్యసేవలు ఉచితం









image

Leave Your Comments