*ఫిర్యాదుదారులు పోలీస్ స్టేషన్ కు వెళ్తే ప్రశాంతమైన వాతావరణం కనిపించాలి* *ఐ జి పి చంద్రశేఖర రెడ్డి*

Date: 2024-08-17
news-banner

అందరి టీవీ డిజిటల్ / మహబూబాద్ జిల్లా ప్రతినిధి 
 *ప్రజల భద్రత తో పాటు మన భద్రత కూడా చాలా ముఖ్యం* 


శుక్రవారం జిల్లా పోలీస్ అధికారులతో మల్టిజోన్-1 ఐజీపి చంద్రశేఖర్ రెడ్డి మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్ కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లా పోలీసు అధికారుల సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ముందుగా సమావేశానికి విచ్చేసిన ఐజిపీ నీ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ స్వాగతం పలికారు.పోలీస్ స్టేషన్ లొ సాయుధ బలగల గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం కాన్ఫరెన్స్ హాల్ లొ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసుల పనితీరును,నిషేధిత మావోయిస్టుల కదలికల పట్ల ప్రస్తుత స్థితిగతులను, జిల్లా శాంతి భద్రతల యొక్క స్థితిగతులను ఎస్పీ ని అడిగి తెలుసుకున్నారు.
.ఈ సందర్భంగా ఐజీ  మాట్లాడుతూ జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పనిచేసే పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ,వారి కదలికలపై ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మావోయిస్టు సరిహద్దు ప్రాంతాల్లో వారు ఎలాంటి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడకుండా వారిని నివారించాలని తెలిపారు.శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
నూతన చట్టలపై అందరు అవగాహన కలిగి ఉండాలని అన్నారు.
పెండింగ్ కేసులను త్వరతగతిలొ పూర్తి చేయాలి, కన్విక్షన్ రేట్ ను పెంచాలని అన్నారు.గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టడంలో జిల్లా పోలీసులు పని చేయాలని అన్నారు.జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,5ఎస్ అమల్లో భాగంగా పోలీస్ స్టేషన్లోని రికార్డులను,ఫైళ్లను ఒక క్రమపద్ధతిలో అమర్చుకోవాలని సూచించారు.పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రతీ ప్రాంతంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకొనే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు నిత్యం అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ అప్రమత్తం చేయాలని తెలియజేసారు.
ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతి రావు, ఏ.ఆర్ డిఎస్పీలు శ్రీనివాస్, విజయ్ ప్రతాప్, సీఐలు,ఆర్ఐలు,ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.






image

Leave Your Comments