ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ప్రత్యర్థుల దాడిలో టీడీపీ మహిళా నేత మృతి

Date: 2024-06-26
news-banner
AndariTv Digital ,Ap 
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మంగళవారం సాయంత్రం టీడీపీ నేత ఏవీ భాస్కర్ రెడ్డి, శ్రీదేవి దంపతులపై ప్రత్యర్థులు దాడి చేశారు. ఈ దాడిలో శ్రీదేవి మృతిచెందింది. భాస్కర్ రెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనతో ఆళ్లగడ్డలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ.. ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని శ్రీదేవి మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులను అడిగి తెలుసుకున్నారు.


https://www.youtube.com/embed/Rm7haatzaFg?si=LD-52Mf9KlwfLyKU
image

Leave Your Comments