నల్లబెల్లి పిఎసిఎస్ లో ఘరానా మోసమా ! పోలీస్ స్టేషన్ లో రైతు ల పిర్యాదు

Date: 2024-08-03
news-banner

అందరి టీవీ డిజిటల్ , నల్లబెల్లి / నర్సంపేట - వరంగల్ జిల్లా ప్రత్యేకం 
మాకు న్యాయం చేయండి అంటూ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు 
అందరి టీవీ కి బాధితుల పిర్యాదు 

నల్లబెల్లి మండల కేంద్రంలో గల ప్రాథమిక సహకార వ్యవసాయ సంఘంలో సిబ్బంది చేసిన ఘరానా మోసానికి అమాయకపు రైతులు అందులో సభ్యులు కానప్పటికీ వారికి వాళ్ళ పేరు మీద డిసిసిబి బ్యాంకులో అకౌంట్ లేనప్పటికీ వారి పైన తప్పుడు రుణాలు అనేటివి మోసపూరితమైన రుణాలు అనేటివి వాళ్ళ పేర్లమైన రికార్డు అయి ఉన్నాయి

ఇందులో పాలకవర్గం వాటా ఎంత సిబ్బంది వాటా ఎంత అసలు ఈ మొత్తం ఘటనకు సూత్రధారి ఎవరు అని ప్రజలు చర్చించుకుంటున్నారు
ఈ ఘరానా మోసానికి పాలకవర్గందే పై చేయి అని చెప్పి పాలకవర్గం దారులే ప్రధాన సూత్రధారులు అని చెప్పి కొందరు అమాయకపు సిబ్బంది రైతులతో వాపోతున్నట్టు సమాచారం 
నానబోయిన రవి అందరి టీవీ తో ఫోన్ లైన్ లో మాట్లాడుతూ నాకు సొసైటీ లో ఎలాంటి సభ్యత్వం లేకున్నా మా పై అప్పు ఎవరు తీసుకున్నారని అడిగితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు 
పూర్తి విచారణ అధికారులు చేపడితే మరిన్ని నిజాలు వెలుగులోకి వస్తాయని వారు కోరుతున్నారు 
ఘటనపై అందరి టీవీ ప్రత్యేకం గా మరో కార్యక్రమం లో 


image

Leave Your Comments