భద్రాద్రి కొత్తగూడెం - ములుగు జిల్లా సరిహద్దుల్లో ఎన్కౌంటర్

Date: 2024-07-25
news-banner

అందరి టీవీ డిజిటల్ ,ములుగు జిల్లా ప్రతినిధి 

గుండాల మండలం దామరతోగు అడవుల్లో ఎన్కౌంటర్
ఈరోజు ఉదయం స్పెషల్ పార్టీ పోలీసులకు నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురు 
కాల్పుల్లో మావోయిస్టు ఒకరు మృతి చెందినట్లు సమాచారం 
మృతుడు 
నల్లమారి అశోక్ అలియాస్ విజేందర్
 30 సంవత్సరాలు R/0 బుద్ధారం గ్రామం మండలం ఘనపూర్ జిల్లా భూపాలపల్లి గ్రామానికి చెందిన నివాసి గా తెలుస్తుంది 
కొన్ని సంవత్సరాల తర్వాత, గుండాల అడవుల్లో తుపాకులు మోత మోగడంతో ఏజెన్సీ గ్రామాల, ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
గుండాల మండలం దామరతోగు గ్రామంలో ఈ కాల్పులు జరగడంతో, పినపాక, గుండాల, మణుగూరు, పోలీసులతో పాటు, ములుగు జిల్లాలోని మంగపేట, తాడ్వాయి, ఏటూరునాగారం, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎంతమంది మావోయిస్టులు ఈ కాల్పుల్లో పాల్గొన్నార‌నేది పోలీసులు అంచనా వేస్తున్నారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో మావోయిస్టులు ఎంతమంది ఉన్నారని, అడవులను జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులు-కూంబింగ్ పోలీసులకు మధ్య భీకరంగా కాల్పులు జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది





image

Leave Your Comments