పార్క్‎కి వెళ్దామనిచెప్పి..కంప చెట్లల్లోకి తీసుకెళ్లి భార్యను పైలోకాలకు పంపిన భర్త..

Date: 2024-07-14
news-banner

అందరి టీవీ డిజిటల్ - క్రైమ్ / ఆంధ్ర ప్రదేశ్ 
భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది అని తెలిసిన భర్త కిరాతకానికి ఒడిగట్టాడు. ఆమెను పార్కుకు వెళదామని నమ్మించి అనంత లోకాలకు పంపించాడు పార్కు సమీపంలో ఉన్న కంపచెట్లలోకి తీసుకొని వెళ్లి గొంతు నులిమి చంపి ఇసుకలో పూడ్చి పెట్టాడు. ఆ తరువాత తానే స్వయంగా పోలీసుల వద్దకు వెళ్లి తన భార్యను హత్య చేశానంటూ లొంగిపోయాడు. ఈ ఘటన కడప జిల్లాలో కలకలం రేపింది.


భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది అని తెలిసిన భర్త కిరాతకానికి ఒడిగట్టాడు. ఆమెను పార్కుకు వెళదామని నమ్మించి అనంత లోకాలకు పంపించాడు పార్కు సమీపంలో ఉన్న కంపచెట్లలోకి తీసుకొని వెళ్లి గొంతు నులిమి చంపి ఇసుకలో పూడ్చి పెట్టాడు. ఆ తరువాత తానే స్వయంగా పోలీసుల వద్దకు వెళ్లి తన భార్యను హత్య చేశానంటూ లొంగిపోయాడు. ఈ ఘటన కడప జిల్లాలో కలకలం రేపింది. కడప జిల్లా ప్రొద్దుటూరులోని అమృత్ నగర్‎కు చెందిన అన్వర్ భాష జమ్మలమడుగులోని మైలవరం మండలం దుడియం గ్రామానికి చెందిన రేష్మ అనే మహిళను 10 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అయితే వీరిద్దరి సంసారం సజావుగానే సాగుతున్నప్పటికీ అన్వర్ భాష ప్రోక్లైన్ డ్రైవర్గా పనిచేస్తుండడం భార్యకు తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇంటికి కొన్ని రోజులు రాకుండా డ్యూటీలోనే ఉండడంతో వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇలా భర్త పనికి వెళ్లే సమయంలో, భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధానికి రేష్మ అనే మహిళ అలవాటు పడింది. ఈ విషయం తెలిసిన అన్వర్ భాష గతంలో ఒకసారి హెచ్చరించినట్లు సమాచారం.






image

Leave Your Comments