కేసులో పరిచయం ఐన వివాహితతో కానిస్టేబుల్ రాసలీలలు…రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న భర్త..

Date: 2024-07-12
news-banner


అంద్దరి టీవీ డిజిటల్ ,ఖమ్మం జిల్లా 
ఖమ్మం కమిషనరేట్ పరిధిలో ఏఆర్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాంబాబు పండంటి కాపురంలో చిచ్చు పెట్టాడు. ఓ కేసు విషయంలో కోర్టు చుట్టూ తిరుగుతూ ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయిన కుటుంబానికి సాయం చేస్తున్నట్లు నమ్మించి ఇల్లాలిపై కన్నేశాడు.

చెల్లీ.. బుజ్జీ అంటూ వరుస కలిపి మాయమాటలతో దగ్గరై చివరికి అనుకున్నంత పనిచేశాడు. ప్రస్తుతం ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవగా వివరాలు ఇలా ఉన్నాయి.

ఆర్థిక సమస్యలు తీరుతాయని..
ఖమ్మం కమిషనరేట్ పరిధిలో బాంబ్ స్క్వాడ్ విభాగంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు రాంబాబు. అయితే ఓకేసు నిమిత్తం కోర్టుకు వచ్చిన త్రివేణితో సన్నిహితంగా మెదులుతూ స్నేహం పెంచుకున్నాడు.

అనంతరం వెస్టీజ్ మార్కెటింగ్ లో చేరితే ఆర్థిక సమస్యలు తీరుతాయని పలుమార్లు త్రివేణిని తనవెంట తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే త్రివేణిని శారీరకంగ లొంగదీసుకుని కోరికలు తీర్చుకున్నాడు.

అయితే కొద్ది రోజులకు త్రివేణి, రాంబాబుల వ్యవహారంలో అనుమానం వచ్చిన త్రివేణి భర్త నాగేంద్రబాబు.. ఒకరోజు వారిద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నాడు.అయితే నాగేంద్రబాబుపై దాడి చేసేందుకు రాంబాబు, త్రివేణిలు ప్రయత్నించారు.

ప్రేమించి కూలాంతర వివాహం చేసుకున్న నాగేంద్రబాబు..
అయితే వారినుంచి తప్పించుకున్న నాగేంద్రబాబు కానిస్టేబుల్ రాంబాబుపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం సీపీ సునీల్ దత్ ను కలిసి వేడుకున్నాడు.

త్రివేణి వద్ద ఉన్న మొబైల్ ఫోన్లో ఇద్దరూ ఏకాంతంగా ఉన్న వీడియోలను అధికారులకు చూపించాడు. దీంతో కానిస్టేబుల్ రాంబాబుతోపాటు త్రివేణిపై ఖానాపురం పోలీసులు కేసునమోదు చేశారు.

పదిసంవత్సరాల క్రితం త్రివేణిని ప్రేమించి కూలాంతర వివాహం చేసుకున్న నాగేంద్రబాబు దంపతులకు ఇద్ధరు కుమారులున్నారు. అయితే ఈ దారుణానికి పాల్పడిన కానిస్టేబుల్ రాంబాబుపై కఠిన చర్యలు తీసుకొని, విధుల నుంచి సస్పెండ్ చేయాలని బాధితుడి తరఫు బంధువులు డిమాండ్ చేస్తున్నారు.




image

Leave Your Comments