ప్రజావాణి దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరించాలి ; మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

Date: 2024-07-08
news-banner

అందరి టీవీ డిజిటల్ ,సీతారాం మహబూబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ 
సోమవారం నాడు, జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై వినతులు సమర్పించేందుకు వచ్చిన దరఖాస్తుల నుండి అదనపు కలెక్టర్లు (స్థానిక సంస్థలు) లెనిన్ వత్సల్ టోప్పో (రెవెన్యూ) డేవిడ్, లతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు, 

ఈ సందర్భంగా కలెక్టర్ దరఖాస్తుదారుల సమస్యలను  క్లుప్తంగా వింటూ సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు,

దరఖాస్తులను పరిశీలించి తమ పరిధిలో ఉంటే వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు,

ఈ సోమవారం నాడు, రెవెన్యూ శాఖ 50, డిఆర్డిఏ 10 , విద్యుత్ శాఖ 2, మున్సిపల్ శాఖ 8, పోలీస్ 2, వైద్య ఆరోగ్యశాఖ 1, ఇలా వివిధ విభాగాలకు చెందిన మొత్తం (205) దరఖాస్తులు వచ్చాయని, ఈ దరఖాస్తులను పరిశీలించి వెంటనే పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు,

ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ నర్మద, సీపీఓ సుబ్బారావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కళావతి భాయ్, డివిఎచ్ఓ మరియన్న, డిఈఓ రామారావు, వివిధ శాఖల అధికారులు ,,,,,,, పాల్గొన్న నారు


image

Leave Your Comments