కొండాయి బ్రిడ్జి పనులను పరిశీలించిన ఏటూరు నాగారం మండల కాంగ్రెస్ నాయకులు...

Date: 2024-07-04
news-banner

అందరి టీవీ డిజిటల్ ,ములుగు జిల్లా ప్రతినిధి 
 పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క గారి ఆదేశాలమేరకు, ఏటూరు నాగారం  మండల అధ్యక్షులు చిటమట రఘు గారి ఆధ్వర్యంలో  మండలంలోని కొండాయి బ్రిడ్జి పరిశీలన చేయడం జరిగింది ఈ సందర్బంగా చిటమట రఘు గారు మాట్లాడుతూ రానున్న వర్షాకాల నేపథ్యంలో గత సంవత్సరం జరిగిన ప్రమాదాలను గుర్తు చేసుకుంటూ కొండాయి, దొడ్ల, మల్యాల గ్రామస్తులకు వీలైనంత బ్రిడ్జి పనులను పూర్తి చేస్తామని అదేవిధంగా పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ది, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క గారి దృష్టికి తీసుకెళ్లి బ్రిడ్జి పనులను పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని విజ్ఞప్తి చేయడం జరిగింది.


ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్సవడ్ల వెంకన్న,జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షులు ఎండీ అయూబ్ ఖాన్,జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ ఖలీల్ ఖాన్, పిఎసిఎస్ వైస్ చైర్మన్ చెన్నూరి బాలరాజు,బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వావిలాల నర్సింహారావు, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య,జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్ పాషా,మండల ఉపాధ్యక్షులు వీసం నర్సయ్య,టౌన్ అధ్యక్షులు ఎండీ సులేమాన్,మాజీ టౌన్ అధ్యక్షులు తాళ్లపెల్లి నరేందర్, మండల సహాయ కార్యదర్శి ముమ్మానేని రమేష్,పిఎసిఎస్ డైరెక్టర్ వంగపండ్ల రవి యాదవ్,టౌన్ బీసీ సెల్ అధ్యక్షులు వలస తిరుపతి,మాజీ వార్డ్ మెంబెర్ పడిదాల హన్మంత్, ఎల్లాస్వామి,నెగరికంటి ముతేష్,హరికృష్ణ,మాజీ ఎంపీటీసీ కొప్పుల శ్రీనివాస్,గడ్డం మహేష్,కూరపాటి వేణు, పరికి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు




image

Leave Your Comments