AndariTv Digital ,Desk News ,Telangana
అసెంబ్లీ ఎన్నికల ముందు మొదలైన చేరికలు.. పార్లమెంట్ ఎన్నికల అనంతరం మరింత జోరందుకున్నాయి...
బి ఆర్ ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ లోకి ఎమ్మెల్యే ల వలసలు మొదలయ్యాయి
ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు చేరగా మరో ఎమ్మెల్యే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరారు
అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి .. పార్లమెంట్ ఎన్నికల్లో పరువు నిలబెట్టుకుందామనుకున్న బీఆర్ఎస్కు అడుగడుగునా ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల తర్వాత గెలిచిన ఎమ్మెల్యేలను నిలబెట్టుకోలేకపోవడం.. లోక్సభ ఎన్నికల ముందు సిట్టింగ్ ఎంపీలే జంప్ అవ్వడం, టికెట్ దక్కించుకున్న తర్వాత ఊహించని రీతిలో ఝలక్ ఇచ్చేసి కాంగ్రెస్లో చేరి పోటీ చేయడం గమనార్హం. ఈ షాక్ల నుంచి తేరుకోకముందే వరుసగా నలుగురు ఎమ్మెల్యేలు ఈ మధ్య కాలంలోనే బీఆర్ఎస్కు గుడ్ బై చెప్పేయడంతో కారు పార్టీ కంగుతిన్నది.
ఇలా ఒక్కొక్కరుగా ‘కారు’ దిగుతుండగా.. తాజాగా చేవెళ్ల నుంచి వరుసగా మూడుసార్లు గెలిచి హ్యాట్రిక్ సాధించిన కాలె యాదయ్య కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, టి. కాంగ్రెస్ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీల సమక్షంలో ఈ చేరిక జరిగింది. కాంగ్రెస్ కండువా కప్పిన రేవంత్.. యాదయ్యను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మరోవైపు.. త్వరలో మరికొన్ని చేరికలు ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.