అందరి టీవీ /డిజిటల్ /డెస్క్ ప్రత్యేకం
అంజలి మీడియా గ్రూప్ 10 వ వార్షికోత్సవం సందర్భంగా అందజేస్తున్న కాకతీయ మహానంది పురస్కారం 2024 , సాంస్కృతిక కార్యక్రమములకు సంబంధించిన పోస్టర్ ను నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి చే ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా దొంతి మాధవ రెడ్డి మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా అందరి టీవీ సమాచార రంగం లో ఎన్నో విజయాలు సాధించి ప్రజల పక్షాన ప్రభుత్వానికి వారధిగా ఉంటుందని అన్నారు . సమాజం లో గల పలు సమస్యలను పరిష్కరించుటలో ముందుంటు ప్రజల మన్ననలను పొందుతుందని అన్నారు. నవంబర్ 2 వ తేదీన 10వ వార్షికోత్సవ సందర్భంగా హనుమకొండ నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో వివిధ రంగాల్లో కృషిచేసిన ఉత్తమోత్తములైన మహానీయులకు కాకతీయ మహానంది, జాతీయ స్థాయిలో అవార్డులు, ఇతర పురస్కారాలను అందజేయడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమం లో అంజలి మీడియా గ్రూప్ చైర్మన్ కామిశెట్టి రాజు పటేల్ గారు ,డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ ,స్టేట్ కరస్పాండెంట్ జంగా రఘువీర్ యాదవ్ ,ఆర్గనైజర్లు నాగజ్యోతి,కామిశెట్టి రంజిత్ కుమార్ పటేల్ , ప్రత్యుష, ప్రియాంక తదితరులు పాల్గొన్నారు .