అందరి టీవీ /డిజిటల్ /హనుమకొండ ప్రతినిధి
అంజలి మీడియా గ్రూప్ 10 వ వార్షికోత్సవం సందర్భంగా కాకతీయ మహానంది పురస్కారం 2024 మరియు సాంస్కృతిక కార్యక్రమములకు సంబంధించిన స్టేట్ కరస్పాండెంట్ జంగా రఘువీర్ యాదవ్ గారి ఆధ్వర్యం లో హనుమకొండ DMHO డాక్టర్ వెంకటరమణ గారికి ఆహ్వాన పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా వెంకటరమణ గారు మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా అందరి టీవీ ఎన్నో విజయాలు సాధించి ప్రజల పక్షాన ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజల మన్ననలను పొందుతుందని అన్నారు. నవంబర్ 2 వ తేదీ 10వ వార్షికోత్సవ సందర్భంగా హనుమకొండ నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో వివిధ రంగాల్లో కృషిచేసిన ఉత్తమోత్తములైన మహానీయులకు కాకతీయ మహానంది, జాతీయ స్థాయిలో అవార్డులు, ఇతర పురస్కారాలను అందజేయడం గొప్ప విషయం అన్నారు