హనుమకొండ DMHO డాక్టర్ శ్రీమతి లలిత దేవి గారిని కలిసి ఆహ్వానాన్ని అందచేసిన అందరి టీవీ టీమ్

Date: 2024-10-24
news-banner
 అందరి టీవీ /డిజిటల్ /హనుమకొండ ప్రతినిధి 

అంజలి మీడియా  గ్రూప్ 10 వ వార్షికోత్సవం  సందర్భంగా కాకతీయ మహానంది పురస్కారం 2024 మరియు సాంస్కృతిక కార్యక్రమములకు సంబంధించిన స్టేట్  కరస్పాండెంట్  జంగా  రఘువీర్ యాదవ్ గారి ఆధ్వర్యం లో హనుమకొండ  DMHO డాక్టర్ శ్రీమతి లలిత దేవి గారికి  ఆహ్వాన పత్రాన్ని అందచేశారు. ఈ సందర్భంగా లలిత దేవి మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా అందరు టీవీ ఎన్నో విజయాలు సాధించి ప్రజల పక్షాన ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజల మన్ననలను పొందుతుందని  అన్నారు. నవంబర్ 2 వ   తేదీ 10వ వార్షికోత్సవ సందర్భంగా హనుమకొండ నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో వివిధ రంగాల్లో కృషిచేసిన ఉత్తమోత్తములైన  మహానీయులకు కాకతీయ మహానంది, జాతీయ స్థాయిలో అవార్డులు,  ఇతర పురస్కారాలను అందజేయడం గొప్ప విషయం అన్నారు

image

Leave Your Comments