అందరి టీవీ /డిజిటల్ /హనుమకొండ ప్రతినిధి
అంజలి మీడియా గ్రూప్ పదవ వార్షికోత్సవ సందర్భంగా కాకతీయ మహానంది పురస్కారం 2024 మరియు సాంస్కృతిక కార్యక్రమములకు సంబంధించిన పోస్టర్ మాజీ మంత్రి బసవరాజు సారయ్య చే ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా బసవరాజు సారయ్య మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాలుగా అందరు టీవీ ఎన్నో విజయాలు సాధించి ప్రజల పక్షాన ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ప్రజల మన్ననలను పొందుతుందని అన్నారు. నవంబర్ 2 వ తేదీ 10వ వార్షికోత్సవ సందర్భంగా హనుమకొండ నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో వివిధ రంగాల్లో కృషిచేసిన ఉత్తమోత్తములైన మహానీయులకు కాకతీయ మహానంది, జాతీయ స్థాయిలో అవార్డులు, ఇతర పురస్కారాలను అందజేయడం గొప్ప విషయం అన్నారు