పీసీసీ మాజీ చీఫ్ డి శ్రీనివాస్ కన్నుమూత

Date: 2024-06-29
news-banner
AndariTv Digital
అందరి టీవీ డిజిటల్ ,డెస్క్ ప్రత్యేకం , ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి, ధర్మపురి శ్రీనివాస్( డీఎస్‌) కనుమూశారు. ఆయన శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో హైదరాబాద్‌లోని తన నివాసంలోనే మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు
ఇవాళ సాయత్రం వరకు ఆయన మృతదేహాన్ని నిజామాబాద్‌లోని స్వగృహానికి తరలించనున్నారు. ఆదివారం సాయంత్రం నిజామాబాద్‌లో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.విషయం తెలియగానే పెద్ద కుమారుడు, మాజీ మేయర్‌ సంజయ్‌ హుటాహుటిన హైదరాబాద్‌ వెళ్లిపోయారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌ ఢిల్లీ నుంచి బయలుదేరారు.




కాగా కొంతకాలంగా ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. క్రిటికల్‌ సర్జరీ తరువాత డీఎస్‌ పూర్తిగా తన ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. అనేక నెలలుగా డీ ఎస్ ఇంటికే పరిమితం అయ్యారు. డీఎస్‌ను కుటుంబ సభ్యులు కొంతకాలంగా ఎవరినీ కలవనీయడం లేదు. చివరకు ఇవాళ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు.

. కాంగ్రెస్‌ కండువా కప్పుకుని చనిపోవాలన్నది ఆయన అంతిమ కోరికగా చెప్పుకునే వాడు. అలాగే ఇటీవల తన పెద్ద కుమారుడు మాజీ మేయర్ సంజయ్ నీ పార్టీలో చేర్పించడానికి ఆయన తో పాటు గాంధీ భవన్ కు వెళ్లారు. కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తుదకు కాంగ్రెస్ లోనే తన శ్వాశ వదిలారు. రాజకీయాల్లో తనదైన శైలితో విలక్షణ నేతగా గుర్తింపు పొందారు.



డీఎస్ పార్థీవదేహన్ని హైదరాబాద్ లోని ఆయన నివాసానికి తరలించారు.. చివరి చూపు చూసేందుకు కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు.. వివిధ పార్టీల నేతలు అక్కడి భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు.






image

Leave Your Comments