జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా...... వర్దన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు .....

Date: 2024-10-21
news-banner

 అందరి టీవీ / డిజిటల్ / వరంగల్ ప్రతినిధి 
ఎమ్మెల్యే నాగరాజు ని కలిసిన వర్దన్నపేట ప్రెస్ క్లబ్ నూతన కమిటీ 
వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వర్దన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు అన్నారు. సోమవారం వరంగల్ నగరంలోని ఏనుమాముల మార్కెట్ యార్డులో వర్దన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు  ను  వర్దన్నపేట ప్రెస్ క్లబ్ నూతన కమిటీ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్ప గుచ్చం అందజేశారు..
ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే నాగరాజు అభినందించారు... 
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టులు అందరు సమన్వయంతో పని చేస్తూ ముందుకెళ్లాలని అన్నారు.విలువలతో కూడిన జర్నలిజంతో ప్రజల మన్ననలు పొందుతూ ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారధిగా నిలవాలని సూచించారు...
జర్నలిస్టుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే వివిధ సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి అర్హులైన జర్నలిస్టులకు అందజేయనున్నట్లు హామీ ఇచ్చారు....
ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి సంక్షేమ పథకాలలో జర్నలిస్టులకు  కూడా అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు... ఈ కార్యక్రమంలో వర్దన్నపేట ప్రెస్ క్లబ్ (ప్రింట్ మీడియా)  గౌరవ అధ్యక్షులు ఐత ప్రవీణ్ కుమార్, అధ్యక్షులు మల్లెపాక కుమార్, ప్రధాన కార్యదర్శి నాంపల్లి మల్లేశం, ఉపాధ్యక్షులు బుర్ర వెంకటరమణ, మునుకుంట్ల దేవేందర్, కార్యదర్శి బండారి విక్రమ్, కోశాధికారి పిట్టల భాస్కర్, ప్రచార సమన్వయ కర్త పసునూరి మురళి,ముఖ్య సలహాదారు బిర్రు కరుణాకర్, కార్యవర్గ సభ్యులు గడ్డం నాగరాజు, కత్తి వేణు కుమార్, ఆభర్ల రాజ కొమురయ్య, హరీష్ తదితరులు పాల్గొన్నారు
image

Leave Your Comments