సిసిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ,ఎమ్మెల్యే

Date: 2024-10-21
news-banner

అందరి టీవీ /డిజిటల్ /వరంగల్ ప్రతినిధి  
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యం లో ఏర్పాటుచేసిన  ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని నేడు  రాష్ట్ర అటవీ పర్యావరణ,  దేవాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ,  వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు ప్రారంభించారు. అనంతరం మార్కెట్ ఆఫీస్ ఆవరణలో రైతులు మరియు కొనుగోలుదారుల సమస్యల మీద మంత్రి ,  ఎమ్మెల్యే   వినతులు స్వీకరించి వారి పట్ల  సానుకూలంగా స్పందించారు. మొదటిసారిగా మార్కెట్ విచ్చేసిన సందర్భంగా మార్కెట్ సెక్రటరి  మంత్రి సురేఖ ,  ఎమ్మెల్యే నాగరాజు లకు పుష్పగుచ్చం అందజేసి మరియు శాలువాతో సన్మానించారు. మార్కెట్ సమస్యల మీద మంత్రి,  ఎమ్మెల్యే కు  వివరించారు.  
ఈ కార్యక్రమంలో జిల్లాకలెక్టర్ సత్య శారదా దేవి, అదనవు కలెక్టర్ సంధ్యారాణి, సిసిఐ జనరల్ మేనేజర్ అర్జున్, వరంగల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు బొమ్మినేనీ రవీందర్ రెడ్డి, స్థానిక డివిజన్ కార్పొరేటర్ తూర్పాటి సులోచన - సారయ్య , ప్రజాప్రతినిధులు, మార్కెటింగ్, వ్యవసాయ శాఖల అధికారులు,  కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు....
image

Leave Your Comments