అందరి టీవీ / డిజిటల్ / మహబూబాద్ ప్రతినిధి
మహబూబాద్ పట్టణంలో గత కొంతకాలంగా వరుస చోరీలతో రెచ్చిపోతున్న దొంగలను మహబూబాబాద్ పోలీసులు పట్టుకున్నారు . ఈ సందర్బంగా మహబూబాబాద్ పోలీసులను మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ సుధీర్ రామ్ నాథ్ అభినందించారు . అడిషనల్ ఎస్పీ జి చెన్నయ్య , మహబూబాబాద్ పట్టణ డిఎస్పి తిరుపతిరావు ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం 6 గంటలకు వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా మహబూబాబాద్ ఇల్లెందు రోడ్ ఆర్తి గార్డెన్ దగ్గర్లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించడం తో అతని వివరాలు అడుగగా విక్రమ్ అని తెలిపాడు. విక్రమ్ తన తల్లిదండ్రులతో కలిసి 2013 వరకు ఖమ్మం లోనే ఉండేవాడని ఆ తర్వాత విక్రం తల్లిదండ్రులు బయ్యారంకు షిఫ్ట్ అయ్యారు దానితో విక్రమ్ కిరాయి ఇంట్లో ఉంటూ డిగ్రీ చదువుకునే సమయంలో సెల్ ఫోన్ లో ఆన్లైన్ బెట్టింగ్ లకు అలవాటయ్యాడు. డబ్బులు పోగొట్టుకొని అప్పుల పాలు అయ్యాడు తిరిగి డబ్బులు ఎలా చెల్లించాలో తెలియక ప్రైవేట్ యాప్ లో కొన్ని లోన్లను తీసుకొని తీర్చలేక దొంగతనాలకు అలవాటు పడ్డాడని పోలీసులు తెలిపారు . అతని దగ్గర నుండి 20 తులాల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు .