అందరిలో టీవీ /డిజిటల్ / హనుమకొండ ప్రతినిధి
వైద్యులు , సిబ్బంది బాధ్యతతో ఆరోగ్య కార్యక్రమాల లక్ష్య సాధనకు కృషి చేయాలని హనుమకొండ జిల్లా DMHO కె లలితాదేవి అన్నారు. ఈరోజు జిల్లా కార్యాలయం లో పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు , పల్లె దవాఖానా ఆర్ బీ ఎస్ కె వైద్యాధికారులతో DMHO లలితాదేవి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా సీజనల్ వ్యాధుల నియంత్రణ లో గత మూడు నెలలు ఇంటింటి సర్వే ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు.