హనుమకొండ | అందరి టీవీ డిజిటల్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. ప్రాణాంతక వ్యాధితో మంచానికే పరిమితమైన తన వీరాభిమాని, 17 ఏళ్ల బాలుడు నిరంజన్ను స్వయంగా అతని నివాసానికి వెళ్లి పరామర్శించారు.
హనుమకొండలో పర్యటించిన సందర్భంగా, నిరంజన్ చివరి కోరిక మేరకు హనుమాన్నగర్లోని అతడి ఇంటికి చేరుకున్న పవన్ కళ్యాణ్, బాలుడితో ఆప్యాయంగా మాట్లాడి ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, భరోసా కల్పించారు.
పవన్ కళ్యాణ్ను ప్రత్యక్షంగా చూడాలనే నిరంజన్ కోరిక తెలుసుకున్న జనసేన నాయకులు, అభిమానులు ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లగా, వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ స్వయంగా ఇంటికి వెళ్లి బాలుడిని కలిశారు.
ఈ సందర్భంగా అక్కడికి చేరుకున్న అభిమానులు, స్థానికులు పవన్ కళ్యాణ్ మానవత్వాన్ని ప్రశంసించారు. రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా, అభిమానుల పట్ల అపారమైన ప్రేమ, ఆప్యాయత చూపించే వ్యక్తిగా మరోసారి నిరూపించుకున్నారని కొనియాడారు.
నిరంజన్ కుటుంబ సభ్యులు కూడా పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. తమ కుమారుడి కోరికను నెరవేర్చినందుకు భావోద్వేగానికి గురయ్యారు.
🙏 వీరాభిమాని చివరి కోరిక తీర్చిన జనసేనాని పవన్ కళ్యాణ్
ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల నిరంజన్ను హనుమకొండలోని అతని ఇంటికి వెళ్లి స్వయంగా పరామర్శించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.
❤️ బాలుడికి ధైర్యం చెప్పి...
🤝 కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చిన జనసేనాని.
ఈ ఘటనతో పవన్ కళ్యాణ్ మానవత్వంపై ప్రశంసల జల్లు కురుస్తోంది.